March 24, 2023
షా ఫోన్ కాల్ తో !! హస్తినలో బీజేపీ నేతలు….
Nationl Politics Politics telangana politics

షా ఫోన్ కాల్ తో !! హస్తినలో బీజేపీ నేతలు….

లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు.

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్ సహా.. హాస్తినలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాజగోపాలరెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు , ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, గరికపాటి, విజయశాంతి, వివేక్ తదితరులున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్.. లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ నాయకులకు బీజేపీ అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంతో కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.