తెలుగుదేశం పార్టీ బాగా స్ట్రాంగ్ అవుతున్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా ఒకటి అని చెప్పాలి. ఈ జిల్లాలో టిడిపి వేగంగా పుంకుంది. కమ్మ వర్గం ప్రభావం ఉండటం, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టిడిపి నేతలు బలపడటం, రాజధాని అమరావతి అంశం..ఇలా కొన్ని కారణాలతో గుంటూరులో టిడిపి బలపడింది. మెజారిటీ నియోజకవర్గాల్లో టిడిపి ఆధిక్యంలో ఉందని చెప్పవచ్చు.

అయితే కొన్ని స్థానాల్లో అభ్యర్ధులు ఎవరు అనేది క్లారిటీ లేకపోవడం, జనసేనతో పొత్తు ఉంటుందా? లేదా? అనే కన్ఫ్యూజన్ వల్ల కొన్ని సీట్లలో క్లారిటీ లేదు. అలా క్లారిటీ లేని స్థానాల్లో తెనాలి ముందు వరుసలో ఉంది. పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే దక్కుతుందనే ప్రచారం ఉంది. కానీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. అటు సత్తెనపల్లి సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఈ సీటు కోసం నలుగురైదుగురు టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. ఈ పోరు వల్ల పొత్తు ఉంటే ఈ సీటు సైతం జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉంది.

ఇటు ప్రత్తిపాడు సీటు ఇంచార్జ్ గా మాకినేని రత్తయ్య ఉన్నారు..కానీ ఈయనకు సీటు దక్కదని తెలుస్తోంది. అటు గుంటూరు వెస్ట్ సీటు కోసం టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. ఇది ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు. అటు నరసారావుపేట ఇంచార్జ్ గా డాక్టర్ అరవింద్ బాబు ఉన్నారు..ఆయనకు సీటు డౌటే అని తెలుస్తోంది. గుంటూరు ఈస్ట్ లో నజీర్ ఉన్నారు..ఆయనకు సీటుపై క్లారిటీ లేదు.



తాడికొండ ఇంచార్జ్ గా తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు..ఆయనకు సీటు ఇస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఇలా గుంటూరులో పలు సీట్ల విషయంలో టిడిపిలో క్లారిటీ లేదు.
