బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధానిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. గురువారం కవిత మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు )ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ ఇస్తామని గత రెండు ఎన్నికల సందర్భంలో చెప్పిన బీజేపీ (BJP) ఆ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ వచ్చిన తర్వాత కనీసం జనాభా గణన చేయలేదన్నారు. బీసీ గణన చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి హక్కులు వారికి రావాల్సిందే అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

