టీడీపీలో ప్రక్షాళన జరగాలి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలి.. ఇదే..పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతు న్నారు. అయితే.. ఈ క్రమంలో ఒక కీలక విషయంపై చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి మనం నేర్చుకున్నది ఏంటనేది.. ప్రధానంగా నాయకులు సంధిస్తున్న ప్రశ్న. గత ఎన్ని కల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని..చంద్రబాబు చెబుతున్నారు. అయితే… వీటిలో ఎన్నింటి కి ఇప్పటి వరకు చెక్ పెట్టారు? ఎన్నింటిని.. ఆయన పరిష్కరించారు? అనేది కీలక ప్రశ్న.

ముఖ్యంగా.. గత ఎన్నికల్లో.. టీడీపీ నేతలకు.. చాలా మందికి టికెట్లు కన్ఫర్మ్ చేయడంలో.. చంద్రబాబు చాలా సమయం తీసుకున్నారు.. ఇది పార్టీలో నైతికంగా ఇబ్బందులు తీసుకువచ్చింది. వైసీపీ జాబితా చూశాకే తప్ప స్పందించని పరిస్థితిలో.. చంద్రబాబు వ్యవహరించారనే వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించా యి. ఈ నేపథ్యంలోనే.. చాలా మంది యువ నాయకులు ఓడిపోయారు. అదేసమయంలో సీనియర్లు కూడా ఇబ్బంది పడ్డారు. ఇక, మళ్లీ ఇప్పుడు యువతకు పెద్దపీట వేస్తామని చెబుతున్నారు. అయితే.. తమకు ముందే సీట్లు ప్రకటించాలని వారు కోరుతున్నారు.

మరోవైపు తాజాగా సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు.. మీకు ఎంతమందికి ఇచ్చుకున్నా ఫణర్వాలేదు.. తప్పులు మాత్రం చేయొద్దని గట్టిగానే చెప్పారు. 40 శాతం సీనియర్లకు ఇచ్చి తీరాల్సిందేనన్నారు. టికెట్ విషయంలో.. చివరి వరకు చంద్రబాబు తాత్సారం చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దాదాపు 60 నియోజకవర్గాల్లో.. నామినేషన్లకు గడువు ముగిసిపోతుందనడానికి రెండు రోజుల ముందు ఖరారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆ తప్పులు చేయొద్దని అయ్యన్న చెప్పారు.

వాస్తవానికి ఇప్పటికే పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్లు అంటూ కొందరిని నియమించారు. అయితే.. వీరే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అంటే.. లేదు. కానీ, ఇంచార్జ్లను మాత్రం నియమించారు. ఇక, అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ.. నాయకులను నియమించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు విజయవాడ పశ్చిమం. ఇక్కడ పార్టీకి దిక్కు మొక్కులేదు. ఇలా.. దాదాపు 70 నియోజకవర్గాల్లో నాయకులు లేరంటే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి..చంద్రబాబు గత తప్పులను సరిదిద్దుకోవాలనేది.. అయ్యన్న వాదన.

Discussion about this post