తెలుగుదేశం పార్టీని వరుసగా విషాద ఘటనలు వెంటాడుతున్నాయి. ఇటీవలే కందుకూరు ఘటన మరవక ముందే గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. అయితే ఈ సభలో మొదట చంద్రబాబు పాల్గొని..తన స్పీచ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కానుకలు పంపిణీ చేసే సమయంలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు మరణించారు.
అయితే వుయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది…దీంతో దీని బాధ్యత తమదే అని వుయ్యూరు ఫౌండేషన్ వారు ప్రకటించి..చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి సాయం అందిస్తామని అన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు వెంటనే స్పందించి..5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు..అటు టీడీపీ నేతలు సైతం తమవంతు సాయం ప్రకటించారు. ఇక ఈ ఘటనపై జగన్ ప్రభుత్వం స్పందించి..2 లక్షల సాయం ప్రకటించింది.
ఇక యథావిధిగానే చంద్రబాబు ప్రచార పిచ్చి వాళ్లే ఈ ఘటన జరిగిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు సభ ముగించుకుని వెళ్ళిపోయినా సరే బాబుదే పైనే వైసీపీ విమర్శలు చేస్తుంది. అయితే ఇలా వరుస ఘటనలు జరగడం వెనుక ఏదో కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇలా తొక్కిసలాటలు జరగడం..టీడీపీ కార్యకర్తలు చనిపోవడం..దానికి సంబంధించిన వీడియోలని వైసీపీ అనుకూల ఒకేలా ప్రసారం చేయడం చేస్తుందని, ఇక పకడ్బంధీగా హ్యా ట్యాగ్లు పెట్టడం, నారా హంతకుడు అని తంబ్ నైల్స్ పెట్టడం..ఆ ఘటనలు జరగగానే..కొందరితో ఆ మీడియా మాట్లాడటం..వారు బాబుని తిట్టడం చేస్తున్నారని అంటున్నారు.
విచిత్రం ఏంటంటే వైసీపీ అనుకూల మీడియాలో ఆ ఇద్దరు, ముగ్గురు మనషులే మాట్లాడుతూ కనిపిస్తారు. బాబుని బూతులు తిడతారు. అయితే బాబు నలభై ఏళ్ల కెరీర్ లో అనేక ర్యాలీలు, సభలు పెట్టారని, ఎన్నడూ జరగని ఘటనలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దీని వెనుక ఏదో కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.