ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది..ఇది ప్రతిపక్షాలు చేసే విమర్శ మాత్రమే కాదు..పక్క రాష్ట్రాల వారు కూడా అంటున్న మాట. అయితే ప్రతిపక్షాల మాటల్లో నిజం లేదు..అసలు గత చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ తక్కువగానే అప్పులు చేశారనేది వైసీపీ వాదన పైగా వైసీపీకి కేంద్రం మద్ధతు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ..నాలుగేళ్ళల్లో ఏపీ అప్పులు 1.77 లక్షల కోట్లు అని చెప్పుకొచ్చారు. కానీ ఈ లెక్క అధికారికంగా చెప్పిందే..కానీ అధికారికంగా లేని అప్పులు చాలానే ఉన్నాయనేది ప్రతిపక్షాల వాదన.
ఎఫ్ఆర్బిఎం పరిధి లోపు, ఏపీ బడ్జెట్ లో చెప్పిన అప్పులనే ఆర్ధిక మంత్రి చెప్పారని, కానీ పరిధి దాటి, అనేక పద్ధతుల్లో చేసిన అప్పులు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఈ అంశమే ఏపీ బిజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి చెబుతున్నారు. నిర్మలా సీతారామన్ కేవలం ఎఫ్ఆర్బిఎం పరిధిలోపు ఉంటూ, రిజర్వ్ బ్యాంక్ వరకే ఉన్న అప్పులని చెప్పారని, కానీ పరిధి దాటేసి ప్రభుత్వ ఆస్తులని తనఖా పెట్టి, మద్యం ఆదాయాన్ని షూరిటీగా పెట్టి తెచ్చిన అప్పులు చాలానే ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద జగన్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని చెబుతున్నారు.
దీంతో టోటల్ గా ఏపీ అప్పు 10 లక్షల కోట్లు అయిందని అంటున్నారు. ఇదే అంశాన్ని టిడిపి నేత జీవీ రెడ్డి కూడా చెబుతున్నారు. ఇప్పటివరకు ఏపీ అప్పు దాదాపు 10 లక్షల 80 వేల కోట్ల రూపాయలు దాటిందని, పార్లమెంట్లో అప్పుల మీద ఇచ్చిన సమాచారం అది ఏపీ బడ్జెట్లో చెప్పిన అప్పులు అని, వాస్తవ అప్పులు కాదని చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశాలు ప్రజలకు కూడా అర్ధమవుతున్నాయి. కాబట్టి అప్పులపై వైసీపీ ఎంత ఫేక్ చేసిన నమ్మే అవకాశాలు లేవు.