రానున్న ఎన్నికల్లో విజయం కోసం టిడిపి జనసేన కూటమి, అధికార వైసిపి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసిపి మళ్లీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైసిపి టిడిపి జనసేన బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా…
తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవి తిరుపతి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు. ఈ ఏడు నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. సూళ్లూరుపేట, గూడూరు, సత్యవేడు ఈ మూడు ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలు కాగా ఈ నియోజకవర్గాల్లో వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టిడిపి బలమైన అభ్యర్థిని బరిలోదించితే విజయం టిడిపిదే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తిరుపతి లో టిడిపి హవానే కొనసాగుతోంది. సర్వేపల్లి లో వైసీపీ హవా ఉంటుందని తెలుస్తోంది. శ్రీకాళహస్తి పూర్తిగా టిడిపికే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి పై ఉన్న వ్యతిరేకత ఇక్కడ టిడిపికి కలిసి వచ్చే అంశాలు. వెంకటగిరిలో కూడా టిడిపి వైసిపి మధ్య హోరాహోరి పోరు ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.
మరి ఎన్నికల వేళకు ఓటర్లు ఎవరికి విజయం అందిస్తారో వేచి చూడాల్సిందే…