రాబోయే ఎన్నికల్లో విజయం సాధించటం టిడిపికి వైసీపీకి కూడా అత్యవసరమే. ఎన్నికల్లో విజయం కోసం ఇరు పార్టీలు తమ సొంత వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇటువంటి సందర్భంలో పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఏ ఏ బలాలు ఉన్నాయో చాలా సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించి చెబుతూ వస్తున్నాయి. కానీ నిజంగా ప్రజలలో ఏ పార్టీకి ఎంత బలముందో ఒకసారి చూద్దామా..
చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం. చిత్తూరు పార్లమెంటు పరిధి మొదటి నుంచి టిడిపిదే హవా అని చెప్పవచ్చు. ఇది టిడిపికి కంచుకోట. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి సొంత జిల్లా కావడంతో ఇక్కడ టిడిపి హవానే కొనసాగుతుంది. గత ఎన్నికల్లో వైసిపి గాలిలో గెలవడమే తప్ప ఇక్కడ టిడిపికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రగిరిలో వైసిపి టిడిపికి మధ్య హోరాహోరీ ఉంటుందని, ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో మాత్రమే గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నగరి, చిత్తూరు, పలమనేరు, కుప్ప