టిడిపి-జనసేన పొత్తుతో వైసీపీ భయపడుతుందా? డౌట్ లేకుండా భయపడుతుందని చెప్పవచ్చు. పైకి మాత్రం పొత్తు వల్ల తమకు నష్టం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ లోలోపల మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే పొత్తు ఉంటే వైసీపీ దారుణంగా నష్టపోనుంది. గత ఎన్నికల్లో టిడిపి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలుజరిగింది.
ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది. అందులో ఓట్లు చీలిక వల్ల కనీసం 50 సీట్లలో వైసీపీ గెలిచిందని చెప్పవచ్చు. ఇప్పుడు పొత్తు వల్ల వైసీపీ ఆ 50 సీట్లు కోల్పోవడం ఖాయం. ఇక మిగిలిన 100 సీట్లు చూస్తే..వైసీపీపై వ్యతిరేకత ఓ స్థాయిలో ఉంది. ఇటు టిడిపి అనూహ్యంగా బలపడుతూ వస్తుంది. చంద్రబాబు అరెస్ట్ తో ఇంకా సానుభూతి పవనాలు ఉన్నాయి. దీంతో వైసీపీ బలం 50 సీట్లకు పడిపోయిందని సర్వేలు అంటున్నాయి.
అంటే టిడిపి-జనసేన పొత్తు ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండనుంది. అందుకే పొత్తు చెడగొట్టడానికి వైసీపీ కుట్రలు చేస్తుందనే చెప్పాలి. ఏదొక విధంగా టిడిపి-జనసేన మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది. సోషల్ మీడియా, ఇటు వైసీపీ అనుకూల మీడియాలో టిడిపి-జనసేనల మధ్య చిచ్చు పెట్టేలా కథనాలు ఇస్తుంది. రెండు పార్టీ శ్రేణులని రెచ్చగొట్టే విధంగా రాజకీయం చేస్తుంది. ఉదాహరణకు టిడిపి వాళ్ళు…జనసేనపై ఎలాంటి విమర్శలు చేయకపోయినా..ఏదో చేసినట్లు చూపించి రెండు పార్టీల మధ్య గొడవ పెట్టేలా చేస్తుంది.
తాజాగా జనసేన నేత నాగబాబు…పొత్తులో ఎక్కువ సీట్లు గెలిస్తే పవన్ సిఎం అవుతారని,అప్పుడు జనసేన కింద టిడిపి పనిచేయాలని అన్నట్లు వైసీపీ భజన మీడియా కథనం ఇచ్చింది.ఈ అంశంపై నాగబాబు ఫైర్ అయ్యారు. అసలు ఆ మీడియాక వివరణ కూడా ఇవ్వాల్సిన పని లేదని, అదొక చెత్త అన్నట్లు వదిలేశారు. ఇలా టిడిపి-జనసేన మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ ప్లాన్స్ ఉంటున్నాయి. కానీ ఎక్కడకక్కడ వాటిని తిప్పికొట్టడంతో వైసీపీకే రివర్స్ అవుతుంది.