కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు రసవతరంగానే ఉంటాయి. ఈ జిల్లాలో గెలుపు కోసం వైసీపీ అధినేత తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే, కడపలో పాగా వేసేందుకు టిడిపి వ్యూహరచన చేస్తోంది.
చంద్రబాబు నాయుడు వ్యూహాలకు వైసిపి అయోమయానికి గురవుతోందని చెప్పవచ్చు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి గెలిచారు. కానీ ఈసారి అవినాష్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించి అభిషేక్ రెడ్డిని కడప నుంచి పోటీ చేయించాలని వైసిపి అధిష్టానం భావిస్తుంది. టిడిపి ఇంచార్జిగా ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. కానీ ఈసారి టిడిపి తరఫున వైఎస్ కుటుంబానికి చెందిన మరొకరిని పోటీ చేయించాలని టిడిపి నేతలు భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కడపలో వైయస్ జగన్ ను ఎదిరించాలి అంటే వైఎస్ కుటుంబంలోని వారే కావాలి అని టిడిపి అధినేత నిర్ణయించి వైసిపి తరఫున సౌభాగ్యమ్మనుగాని, సునీత రెడ్డిని గాని బరిలో దించే ఆలోచనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే కనుక నిజమైతే వైయస్ వివేకానంద రెడ్డి మరణంతో ఇబ్బందులలో ఉన్న కుటుంబానికి కడప ప్రజలు అండగా ఉంటారని, ఓట్లు వేసి గెలిపిస్తారని టిడిపి నమ్మకం. అందుకే టిడిపి వైయస్ కుటుంబానికి చెందిన వారిని కడప ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచన చేస్తుంది.
ఈ వ్యూహం ఫలిస్తే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఎదురు దెబ్బ తప్పదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి కడప ప్రజలు ఎవరిని అక్కున చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే..
ReplyReply allForwardAdd reaction |