మరో సారి అధికారంలోకి రావడానికి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. టిడిపిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతో వేధిస్తూ టిడిపి నేతలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. కానీ టిడిపి వాటిని లెక్కచేయకుండా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
కర్నూలు నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు వార్తలు రావడంతో, వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో వైసిపి పై ఉన్న వ్యతిరేకతతో పాటు, ఈ అభ్యర్థుల పేర్లు కూడా వైసిపి నేతలను కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.
కర్నూలు నుంచి టీజీ భరత్, నంద్యాల ఎన్ ఎం డి ఫరూక్, పాణ్యం గౌరు చరితారెడ్డి, బనగానపల్లి బీసీ జనార్ధన రెడ్డి, డోన్, ఆళ్లగడ్డ ఈ రెండు నియోజకవర్గాలు సరైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకుల మధ్య సమన్వయంతో సరైన నేతల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. శ్రీశైలం బుడ్డా నాగేశ్వర రెడ్డి, మంత్రాలయం తిక్కరెడ్డి పేరు వినిపిస్తున్నది. ఆదోని మీనాక్షి నాయుడు పేరు దాదాపు ఖరారు అయినట్లే, పత్తికొండ కేఈ శ్యామ్, ఎమ్మిగనూరు జయ నాగేశ్వర్ రెడ్డి పేర్లు టిడిపి అధిష్టానం ప్రకటించింది. ఇప్పుడు ఈ నేతల గెలుపు కోసం టిడిపి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అభ్యర్థుల పేర్లు చూస్తేనే వైసీపీ నేతలు కంగారుపడుతుంటే, విజయం కోసం టిడిపి ప్రయత్నాలు మొదలయితే వైసీపీ నేతల పరిస్థితి ఏమిటో అని సన్నిహిత వర్గాలు అంటున్నాయి..