ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఇది అధికార పార్టీ కుట్ర అని, జగన్మోహన్ రెడ్డి కక్షతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించారని టిడిపి నాయకులు అంటున్నారు. కానీ ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ బిజెపి, బిఆర్ఎస్ జగన్ తో కలిసి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధు యాష్కీ కాంగ్రెస్ నేత… కాబట్టి ఆయనకు కెసిఆర్ అన్నా , మోడీ అన్నా యాంటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అంటే వ్యతిరేకత ఉంది. ఆ కారణంతో అలా చెప్పాడు అని కొందరు ఆ మాటలను పట్టించుకోలేదు. కానీ విశ్లేషించి చూడగా అదే నిజమేమో అనిపిస్తుంది.
ఎప్పుడు బహిరంగంగా మోడీ గానీ, కెసిఆర్ గానీ జగన్ ను విమర్శించలేదు. అలాగే జగన్ కూడా మోడీని, కేసీఆర్ ని విమర్శించలేదు. 2019లో వైసీపీ గెలుపుకు పరోక్షంగా బిఆర్ఎస్, అటు బిజేపి సపోర్ట్ చేసిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలోని టిడిపి నాయకుల నుంచి టిడిపికి రావలసిన ఆర్థిక మూలాలను అందకుండా చేసి వారి గెలుపు పై పరోక్షంగా అడ్డుకట్ట వేశారని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం కేంద్రం నుంచి టిడిపి నేతలు ఇళ్లపై ఐటి దాడులు చేయించి, రాష్ట్రంలోని ఐఏఎస్ లను, ఐపీఎస్ లను వైసిపి వారికి అనుగుణంగా నియమించి వైసిపి గెలుపుకు పరోక్షంగా సహకరించారని రాజకీయ వర్గాల అభిప్రాయం.
ఇప్పుడు కూడా బిఆర్ఎస్, టిడిపిని శత్రువు గానే చూస్తుంది. మోడీకి చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు లేవు. ఎవరో ఒకరిద్దరు నేతలు తప్ప వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే వారు లేరు. బిజెపి జాతీయ నాయకులు, బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు కు సపోర్ట్ చేసేవారు కూడా తక్కువే. ఇవన్నీ పరిశీలించి చూడగా ఎన్డీఏకు వ్యతిరేకంగా రూపొందుతున్న కూటమిలో కీలక పాత్ర పోషిస్తాడని కారణంతో జగన్ సహాయంతో మోడీ… చంద్రబాబు నాయుడును అరెస్ట్ అరెస్ చేయించారని రాజకీయ విశ్లేషకుల అనుమానం..ఇది టిడిపి శ్రేణుల్లో కూడా ఉంది.
ReplyReply allForward |