ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి, వైసిపి పావులు కదుపుతోంది. ఇరు పార్టీలు సర్వేలు నిర్వహించి ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులను బరిలో దించుతున్నాయి. కానీ గతంలో కొన్ని జిల్లాలలో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. అన్ని నియోజకవర్గాలలో వైసిపిని విజయం సాధించింది. అటువంటి నియోజకవర్గాలలో కర్నూల్ ఒకటి. ఈ పార్లమెంట్ పరిధి లో ఉన్న కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ ఈ నియోజకవర్గాలలో గతంలో వైసిపి నే అన్నింటిలో విజయం సాధించింది. కానీ ఐదు సంవత్సరాలు గడిచేసరికి ఈ నియోజకవర్గ ప్రజలలో అధికార వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టమవుతుంది.
కోడుమూరు ఎస్సీ రిజర్వాడ్ నియోజకవర్గం. మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ఈ నియోజకవర్గాలలో మాత్రమే వైసిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది కూడా తక్కువ మెజారిటీతోనే విజయం సాధించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ఈ మూడు నియోజకవర్గాలలో వైసిపి టిడిపి మధ్య హోరాహోరి పోరు ఉంటుందని, ఈ నియోజకవర్గాలలో టిడిపి గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో అన్నింటిలో విజయం సాధించిన వైసిపి ఈసారి రెండు మూడు స్థానాలకే పరిమితం కానుందా? అవునని సర్వేలు చెబుతున్నాయి.. మరి ఎన్నికల వేళకు ఎటువంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాల్సిందే…