ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసిపి ప్రతిపక్ష టిడిపి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. గెలిచే అభ్యర్థులను బరిలో దించడానికి సర్వేలో నిర్వహిస్తున్నాయి. సర్వేల ఆధారంగా అభ్యర్థుల నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైసిపి ఇంచార్జిల మార్పుతో ఎన్నికలకు సిద్ధమైందని చెప్పవచ్చు. కానీ టిడిపి ఇంకా అభ్యర్థుల ప్రకటనలోని ఉంది అని తెలుస్తోంది. అధికార పార్టీకి అధికార బలంతో పాటు ఆర్థిక బలం కూడా పుష్కలంగా ఉంది. కానీ టిడిపికి అధికారులు బలం లేదు. ఆర్థికంగా బలమైన అభ్యర్థులను పోటీలో నిలబెట్టడానికి టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. అటువంటి తరుణంలో జగన్ వేసే కొన్ని ఎత్తులను గ్రహించినా ఏమీ చేయలేని స్థితిలో టిడిపి ఉంది అని తెలుస్తోంది. అవి ఏంటంటే ఎంపీ అభ్యర్థులుగా టిడిపి ఆర్థికంగా బలమైన సొంత సామాజిక వర్గం నేతలను బరిలో దించుతుంటే, ఇందుకు విరుద్ధంగా వైసిపి బీసీ సామాజిక వర్గ నేతలను నిలబెడుతున్నారు. జగన్ ప్రయోగిస్తున్న బీసీ మంత్రం టిడిపి నేతలకు నిద్రను దూరం చేస్తోందని చెప్పవచ్చు.
ఏలూరు నుంచి వైసీపీ కారుమూరి సునీల్ యాదవ్ ప్రకటిస్తే, టిడిపి భాష్యం రామకృష్ణ లేదా మరో కమ్మ సామాజిక వర్గ నేతను బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసరావుపేట వైసిపి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుండగా, టిడిపి నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో ఉన్నారు. ఎక్కువ నియోజకవర్గాలలో టిడిపి కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులను బరిలో దించుతుంటే, వైసిపి యాదవ లేదా మరో బీసీ కమ్యూనిటీ వారికి టికెట్ ఇస్తున్నారు. ఇప్పటికైనా టిడిపి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిడిపి తరఫున బీసీ సామాజిక వర్గ బలమైన నేతలను నిలబెట్టి ఆర్థికంగా మద్దతు ప్రకటించాలని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా వైసీపీ పై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవాలని సన్నిహిత వర్గాలు టిడిపికి సూచిస్తున్నాయి.
మరి టిడిపి నేత ఏ నిర్ణయం తీసుకుంటారో…