అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలు ఉన్నాయని చెప్పవచ్చు. గెలిచే అభ్యర్థుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని పార్లమెంటు స్థానాలకు వైసిపి, టిడిపి జనసేన కూటమి కూడా తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. అటువంటి వాటిలో కాకినాడ పార్లమెంటు స్థానం ఒకటి. ఈ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున చలమలశెట్టి సునీల్, టిడిపి జనసేన తరఫున సానా సతీష్ బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇరువురు అభ్యర్థులు వ్యాపారస్తులే. అంగ బలం, అర్థబలంలో ఇద్దరు సమానమే. కానీ రాజకీయంగా సునీల్ కే ఎక్కువ అనుభవం ఉంది అని చెప్పవచ్చు. సానా సతీష్ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండటం వల్ల టిడిపి జనసేన అభ్యర్థిగా సానా సతీష్ ను ప్రకటించారని చెప్పవచ్చు.
చలమలశెట్టి సునీల్ ఇప్పటికే మూడుసార్లు ఓటమిపాలయ్యారు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వైసిపి తరఫున కాకినాడ పార్లమెంటు బరిలో దిగుతున్నారు. కానీ రాజకీయ సామాజిక సమీకరణాలను చూస్తే సానా సతీష్ అంటే టిడిపి జనసేన కూటమికే సామాజిక వర్గంలోని ఓట్లు ఎక్కువగా పడతాయని తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాలలో సగానికి పైగా టిడిపి జనసేనకి మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో చలమలశెట్టి సునీల్ విజయం సాధిస్తారా? సతీష్ ని తట్టుకొని నిలబడగలరా అంటే కష్టమనే చెప్పవచ్చు.
మరి ఎన్నికలకు వేళకు ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాల్సిందే…..