ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లోని రాజకీయాలు మారిపోతూ ఉంటాయి. గత ఎన్నికలకు ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి. కొన్ని జిల్లాలలో గత ఎన్నికల్లో టిడిపికి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అటువంటి జిల్లాలు కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం. ఈ జిల్లాలలో టిడిపి కనీసం ఒక స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని సర్వేలు చెబుతున్నాయి.
నెల్లూరు జిల్లాను చూస్తే ఈ జిల్లాలో గతంలో వైసీపీకి 54% ఓట్లు వస్తే, టీడీపీకి 38 శాతం మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడున్న సర్వే ప్రకారం టిడిపికి ఓట్లు శాతం పెరిగి టిడిపికి 42 శాతం, వైసీపీకి 46% ఓట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు నెల్లూరులో ఉన్న 10 నియోజకవర్గాలలో వైసిపికి 6 వస్తే, టిడిపి 4 సీట్లు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. కడప జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాలో గతంలో 60 శాతం వైసీపీకి, 34% మాత్రమే టిడిపికి ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడున్న సర్వేలు నియోజకవర్గంలో వైసిపి పరిస్థితిలను బట్టి చూస్తే వైసీపీకి 50%, టిడిపికి 40 శాతం ఓట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. 7 నియోజకవర్గాలలో 5 వైసిపికి, 2 స్థానాలు టిడిపికి వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.
మరి ఎన్నికల నాటికి ఈ ఫలితాలు ఎంతవరకు టిడిపికి విజయాన్ని అందిస్తాయో వేచి చూడాల్సిందే..
ReplyReply allForwardAdd reaction |