ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గెలిచే అభ్యర్థులను ఏరి కోరి బరిలో దించడానికి సిద్ధమవుతోంది. సర్వే సంస్థల నివేదికలే కాకుండా, సొంతంగా సర్వేలు నిర్వహించి మరి అభ్యర్థుల బలాబలాలను నిర్ణయిస్తున్నారు. వైసిపి అధిష్టానం ఇప్పటికే ఇంచార్జి ల మార్పుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో ఇంచార్జి లను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం చేశారని చెప్పవచ్చు.
తాజాగా పరుచూరుకు, కందుకూరుకు ఇంచార్జి లను ప్రకటించారు. పరుచూరుకు ఎడం బాలాజీని ప్రకటించగా, కందుకూరుకు కటారి అరవింద ను ప్రకటించారు. కానీ స్థానిక పరిస్థితుల ఆధారంగా విశ్లేషిస్తే ఈ రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులుగా వీరి గెలుపు కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎడం బాలాజీ కష్టపడకుండానే ఎమ్మెల్యే కావాలని మనస్తత్వం కల నేత. గతంలో వైసిపి టికెట్ ఇవ్వలేదని టిడిపికి అనుకూలంగా ప్రచారం చేసిన వ్యక్తి, ఇప్పుడు మళ్లీ టికెట్ కోసం వైసీపీ లోకి వస్తే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎడం బాలాజీని తమ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆర్థికంగా బలమైన నేత అని ఒకే ఒక కారణం తప్ప ఎడం బాలాజీని పరుచూరు అభ్యర్థిగా నిర్ణయించటానికి సరైన కారణాలే లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గ ఓట్లన్నీ ఎడం బాలాజీ కే పడతాయని భ్రమలో వైసిపి నాయకత్వం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కందుకూరు నుంచి కటారి అరవిందను ఇంచార్జిగా నియమించారు. కానీ ఈ నియోజకవర్గంలో మహీధర్ రెడ్డిని ఢీకొట్టే నాయకుడే లేడు అన్నది వాస్తవం. అది టిడిపి అయినా వైసీపీ అయినా. కానీ మహిధర్ రెడ్డిని పక్కనపెట్టి అరవింద కు టికెట్ ఇచ్చారు. దీనికి కారణం కందుకూరిలో యాదవ ఓట్లు ఎక్కువగా ఉండడంతో కుల సమీకరణాలకు వైసీపీ తెరతీసిందని తెలుస్తోంది. రాజకీయంగా రెడ్డి కమ్మ సామాజిక వర్గం వారే చక్రం తిప్పుతున్నా ఓటర్లు మాత్రం యాదవ సామాజిక వర్గం వారే కావడంతో అరవిందను బరిలో దించారని తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే చూస్తే ఈ రెండు నియోజకవర్గాలలో వైసిపి గెలుపు కష్టం అని సామాన్యునికి సైతం అర్థమవుతుంది.
మరి ఇటువంటి నిర్ణయాలతో వైసిపి అధికారంలోకి రావాలని ఎలా కోరుకుంటుందో!!!!?