రాబోయే ఎన్నికల్లో విజయం కోసం టిడిపి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. గెలుపు కోసం లభించే ఈ చిన్న అవకాశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారు. వైసిపి అధికార బలానికి లొంగకుండా తమ పార్టీని నిలబెట్టుకునేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు. అభ్యర్థుల ప్రకటనలో కూడా టిడిపి దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నరసాపురం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, హిందూపూర్, అనంతపురం. ఈ 13 లోక్ సభ స్థానాలలో టిడిపి తమ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో విజయం సాధించే వారెవరో చూద్దామా…
శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు బరిలో ఉన్నారు. ఇతనే ఈసారి కూడా ఎంపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి నుంచి బైరా దిలీప్ చక్రవర్తి ని టిడిపి బరిలో దించింది. కాపు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో బైరా దిలీప్ చక్రవర్తి గెలుపు సునాయాసమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి ఎం భరత్ కు గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాకినాడ నుంచి సానా సతీష్ కుమార్ ను జనసేన తరఫున బరిలోదించారు. ఈ నియోజకవర్గంలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణం రాజు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా హోరాహోరీ పోరు ఉంటుందని తెలుస్తుంది. ఏలూరు నుంచి గోపాల్ యాదవ్ గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. విజయవాడ నుంచి కేశినేని చిన్నికే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మచిలీపట్నం వల్లభనేని బాల సౌరి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు మధ్య జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపి తరఫున బరిలో ఉన్నారు. ఇతనే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిరుపతి నుంచి అంగలకుర్తి నిహారిక అని కొత్త అభ్యర్థిని టిడిపి ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో మాత్రమే వైసిపి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజంపేట నుంచి బాలసుబ్రమణ్యం, హిందూపూర్ నుంచి బీకే పార్థసారథి, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు బరిలో ఉన్నారు. వీరందరూ టిడిపి తరఫున విజయం సాధించే వారే..
ReplyReply allForwardAdd reaction |