ఎన్నికల్లో విజయం కోసం టిడిపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలకు తోడుగా ప్రజలలో కూడా అధికార వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను టిడిపి ఓట్లుగా మలుచుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కొన్ని నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులు ఎంపిక చేసే ప్రక్రియలో ఉంది. అటువంటి వాటిలో కైకలూరు నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో టిడిపికి పట్టున్నా, సరైన లీడర్ లేక ఎక్కువ సార్లు విజయం సాధించలేకపోయారు. టిడిపి తరఫున జయ మంగళ వెంకటరమణ ఒకసారి విజయం సాధించారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల జయ మంగళ వెంకటరమణ వైసిపిలోకి మారటంతో అక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం టిడిపి నేతలు శోధిస్తున్నారని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు పొత్తులో భాగంగా జనసేనకు గాని, బిజెపికి గాని ఇస్తారని కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ నియోజకవర్గ టిడిపి క్యాడర్ మొత్తం కైకలూరు నుంచి కచ్చితంగా టిడిపి అభ్యర్థి పోటీ చేయాలని బలంగా కోరుతుండడం వలన కొత్త అభ్యర్థి కోసం టిడిపి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వీరమల్లు వెంకట సత్యనారాయణ పేరు తెర మీదకు వచ్చింది. మూడు దశాబ్దాలుగా టిడిపికి వీర విధేయుడుగా ఉంటున్న రాజకీయ కుటుంబం. ఇది వివాద రహితుడిగా పేరు ఉంది. అంతేకాకుండా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కూడా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న నేత కావడంతో టిడిపి అధిష్టానం వీరమల్లువైపు చూస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని మంచి లక్షణాలు ఉన్న వీరమల్లు సత్యనారాయణకు టికెట్ ఇస్తే ఈసారి కైకలూరులో కచ్చితంగా టిడిపి జెండా ఎగురుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఎన్నికల నాటికి టిడిపి అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారో వేచి చూడాల్సిందే…