ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో ఇరు పార్టీలు సొంతగా సర్వేలు నిర్వహించి గెలిచే అభ్యర్థులను నిలబెడుతున్నారు. వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో ముందుంటే, టిడిపి ఇంకా సర్వేలలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మరలచుకోవడానికి అనువైన అభ్యర్థిని తమ అభ్యర్థిగా ప్రకటించడానికి టిడిపి ప్రయత్నాలు చేస్తోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి అభ్యర్థి కోసం టిడిపి సర్వే నిర్వహిస్తోంది. వైసీపీ మేకపాటి కుటుంబం నుంచి ఒకరిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ టిడిపి మాత్రం ఇంకా తమ అభ్యర్థి ఎవరో స్పష్టత ఇవ్వలేదు. ఉదయగిరి ప్రస్తుత ఇంచార్జ్ బొలినేని రామారావు తనకే ఈసారి టికెట్ అని చెబుతున్నారు. కానీ అనూహ్యంగా కాకర్ల సురేష్ అనే ఒక ఎన్నారై కూడా టిడిపి తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. బొల్లినేని రామారావు టిడిపి ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. కానీ సురేష్ ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలతో పాటు, పార్టీ కార్యక్రమాలలో కూడా ముందున్నారు. ఆ సమయంలో మళ్ళీ బొల్లినేని రామారావు పార్టీ ఇంచార్జిగా పగ్గాలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎవరిని తమ అభ్యర్థిగా నిలబెట్టినా ఖచ్చితంగా టిడిపినే విజయం సాధిస్తుంది. కానీ ఉదయగిరి టిడిపి లో ఉన్న గ్రూపు తగాదాలను సర్ది చెప్పి, కాకర్ల సురేష్ ని తమ అభ్యర్థిగా ప్రకటించి విజయం సొంతం చేసుకోవాలని టిడిపి అధిష్టానం భావిస్తోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మరి ఎన్నికల వేళకు టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో….