రాష్ట్రంలో రాజకీయాలు మారుతూ ఉన్నాయి. గెలిచే అభ్యర్థుల ఎంపికలో టిడిపి వైసిపి తలమునకలు అయ్యాయని చెప్పవచ్చు. వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ముందుందని తెలుస్తోంది. గెలిచే అభ్యర్థులను పోటీకి దింపేందుకు టిడిపి వ్యూహరచన చేస్తోంది. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా టిడిపి జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పవచ్చు. సొంతంగా సర్వేలు నిర్వహించి మరి అభ్యర్థుల ఎంపిక చేస్తోంది టిడిపి అధిష్టానం. ఇప్పటికే ఆ సర్వేలలో గెలిచే అభ్యర్థులకి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కొన్ని స్థానాలలో అభ్యర్థులు ఎవరో, ఎవరిని నిలబెట్టాలో అర్థం కాని స్థితిలో టిడిపి అధిష్టానం ఉందని తెలుస్తోంది. అటువంటి నియోజకవర్గాలలో చింతలపూడి ఒకటి.
చింతలపూడి ఎస్సి రిజర్వడ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి రోషన్ కుమార్, బొమ్మజీ అనిల్ బరిలో ఉన్నారు. వీరిలో ఒకరు నేతలతో సన్నిహితంగా ఉంటే, మరొకరు ప్రజలకు చేరువవుతున్నారు. వీరిలో రోషన్ కుమార్ కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. మరి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇస్తారో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఈ నియోజకవర్గంలో ఎవరిని టిడిపి అభ్యర్థిగా నిలబెట్టినా కచ్చితంగా విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
టిడిపి తరఫున ఎవరు నిలబడతారో వేచి చూడాల్సిందే..