ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు రోజుకో రకంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వైసిపి హవా కొనసాగినా ఈసారి టిడిపి వైఫై చూస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అటువంటి వాటిలో నంద్యాల పార్లమెంటు స్థానం ఒకటి.
నంద్యాల పార్లమెంటు స్థానంలో ఆళ్లగడ్డ, శ్రీశైలం నంది కొట్కూరు, డోన్, పాణ్యం, నంద్యాల, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. వీటిలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నందికొట్కూరు, ఆళ్లగడ్డలో మాత్రమే వైసిపి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం, నంద్యాల, బనగానపల్లెలో టిడిపికే విజయ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డోన్, పాణ్యం నియోజకవర్గాలలో వైసిపి టిడిపి మధ్య హోరాహోరీ ఉంటుందని, ఈ పోరులో టిడిపిని గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో రెండు వైసీపీ, మూడు టిడిపి, రెండు హోరాహోరీ పోరు మధ్య టిడిపి గెలిచే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.
ఈ సర్వే ఈ ఫలితాలను బట్టి చూస్తే నంద్యాలలో వైసీపీకి వచ్చేవి రెండు నియోజకవర్గాలే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు…