రాబోయే ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకమని చెప్పవచ్చు. ఈ ఎన్నికలు టిడిపికి ప్రతిష్టాత్మకం కాగా, వైసీపీకి చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. టిడిపి ఖచ్చితంగా గెలిచి అధికారాన్ని ఏర్పాటు చేయాలని కృషి చేస్తుంది. వైసీపీకి పట్టున్న నియోజకవర్గాలలో విజయం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
రాజంపేట పార్లమెంటు స్థానం. ఈ పార్లమెంటు స్థానంలో రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గాలలో గతంలో వైసిపి విజయం సాధించిందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన కోడూరు, రాయచోటి, పుంగనూరులో మాత్రమే వైసిపి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తంబళ్లపల్లె, పీలేరు కచ్చితంగా టిడిపి గెలిచే స్థానాలని సర్వేలు చెబుతున్నాయి. రాజంపేట, మదనపల్లిలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ ఉంటుందని ఈ పోరులో టిడిపి నే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజంపేట పార్లమెంటు స్థానంలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో మూడు వైసిపి గెలిచే అవకాశాలు ఉండగా, మిగిలిన నాలుగు కూడా టీడీపీ ఖాతాలోని చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరి ఇటువంటి సందర్భంలో వై నాట్ 175 అంటున్న జగన్ నినాదం ఏమవుతుందో??
ReplyReply allForwardAdd reaction |