నారా లోకేష్ ఆంధ్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత. ఇప్పుడు టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువగా కష్టపడుతునాడు అన్నది వాస్తవం.
రాబోయే 30 సంవత్సరాల లో టిడిపి విజయం సాధించడానికి, టిడిపి అధికారంలో ఉండడానికి లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. అందుకోసం సీనియర్లను పక్కనపెట్టి మరి యువతకు టికెట్లు ఇవ్వాలని, పార్టీలోకి తీసుకోవాలని లోకేష్ నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధికారంలోకి రావడానికి లోకేష్ 30 నియోజకవర్గాలలో అంటే గుడివాడ, గన్నవరం, పుంగనూరు మొదలైన నియోజకవర్గాలలో కచ్చితంగా గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని చెప్పవచ్చు. టిడిపి అధికారంలోకి వచ్చినా ఈ నియోజకవర్గాల్లో ఓటమి పాలైతే అది నిజమైన విషయం కాదని లోకేష్ భావిస్తున్నారు. అందుకే రాబోయే 30 సంవత్సరాలలో టిడిపిని అధికారంలో ఉండడానికి కావలసిన ప్రయత్నాలు నారా లోకేష్ చేస్తున్నారు. నారా లోకేష్ పదవి కన్నా పార్టీ నే ముఖ్యమని, ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని నారా లోకేష్ చెబుతున్నారు.
మరి లోకేష్ స్కెచ్ ఫలిస్తే వైసిపికి షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.