రాబోయే ఎన్నికల్లో గెలిచి విజయం సాధించాలని టిడిపి దృఢ సంకల్పంతో ఉంది. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి మాత్రమే అధికారాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కానీ అధికార వైసిపి మాత్రం ఈసారి కూడా గెలిచేది వైసిపి నేనని, మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీని అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి బలబలాలు ఎంత ఉన్నాయో తెలుసుకుందామా…
అనంతపూర్ పార్లమెంటు పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో సింగనమల ఎస్సీ రిజర్వుడు స్థానం. ఈ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం ఈ ఐదు నియోజకవర్గాలలో టిడిపి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని, టిడిపి తరఫున ఎవరిని నిలబెట్టినా కచ్చితంగా విజయం సాధిస్తారని చెబుతున్నారు. గుంతకల్ నుంచి జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో జనసేన మద్దతు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఈ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తే టిడిపి మద్దతుతో కచ్చితంగా విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాడిపత్రిలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, ఈ పోరులో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాలు టిడిపి గెలిచే అవకాశాలు ఉండగా, ఒక నియోజకవర్గం వైసిపి, ఒక నియోజకవర్గంలో హోరాహోరీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ విశ్లేషణను బట్టి చూస్తే అనంతపూర్ లో కూడా వైసిపికి ఓటమి తప్పదని తెలుస్తోంది…