ఎన్నికల్లో విజయం కోసం వైసిపి, టిడిపి వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రజల ముందుకు వెళుతోంది. వైసీపీ చేసిన అరాచకాలను ప్రజల ముందుకు టిడిపి ప్రజల ముందుకు తీసుకు వెళుతుంటే, తాము ఇచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ ధీమాతో ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ స్థానాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో? ఏ పార్టీకి ఎంత బలం ఉందో ఒకసారి చూద్దామా..
గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో చాలా జిల్లాలలో వైసిపి అన్ని స్థానాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలలో విజయం సాధించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అలా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కడప జిల్లా ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపి అన్ని స్థానాలలో భారీ మెజారిటీతో విజయం సాధించిందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు కడపలో మొత్తం స్థానాలను వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కడప పార్లమెంటు పరిధిలో ఉన్న బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల ఈ నియోజకవర్గాలన్నీ గత ఎన్నికల్లో వైసిపి భారీ మెజారిటీతో విజయం సాధించినవే. కానీ ఈసారి వైసీపీకి అంతా మెజారిటీ వచ్చే సూచనలేమి కనిపించడం లేదు. ఎస్సీ నియోజకవర్గమైన బద్వేల్ లో మాత్రమే వైసిపి విజయం సాధించవచ్చు అని తెలుస్తోంది. కడప వైఎస్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గంలో కూడా విజయం సాధించవచ్చని చెప్పవచ్చు. పులివెందుల, బద్వేల్, కడప ఈ మూడు నియోజకవర్గాలలో వైసిపి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలలో కూడా టిడిపి గట్టి పోటీ ఇస్తుందని ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, టిడిపి బలమైన అభ్యర్థిని నిలబెడితే విజయం కూడా సాధించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సీఎం సొంత జిల్లాలో కూడా వైసిపి కి ఎదురుదెబ్బ తప్పదా అని సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి…