రాబోయే ఎన్నికల్లో విజయం ఇరు పార్టీలకు కీలకమే. ఈసారి గెలిచి అధికారం చేపట్టాలని టిడిపి భావిస్తుంటే, మళ్ళీ గెలిచి తమ సత్తా చాటాలని వైసిపి ఆశపడుతోంది. మరి ఇటువంటి తరుణంలో పార్లమెంటు స్థానాల వారీగా ఏ పార్టీకి ఎంత బలం ఉందో తెలుసుకుందామా..
హిందూపూర్ పార్లమెంట్ స్థానం. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హిందూపురం, పెనుగొండ, మడకశిర, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు ఈ నియోజకవర్గాలలో దాదాపు టీడీపీ గెలిచి నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. హిందూపురం బాలకృష్ణ సొంత నియోజకవర్గం కావడంతో ఈసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. పెనుకొండ ఈ నియోజకవర్గంలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరి పోరు ఉంటుందని, టిడిపికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. మడకశిర ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వైసీపీకి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. కదిరి ఈ నియోజకవర్గం నుంచి కూడా టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని గెలిచే అవకాశాలు టిడిపికే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు ఈ నియోజకవర్గాలన్నీ టిడిపినే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హిందూపూర్ లో ఉన్న ఏడు నియోజకవర్గాలలో వైసిపి ఒక నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.