పల్లెల్లో వైసిపి పార్టీని బలోపేతం చేసేందుకు పల్లెకు పోదాం కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని వినాయక చవితి తర్వాత ప్రారంభిస్తారని, జగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ,కొన్ని సచివాలయాలు సందర్శిస్తారని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత మండల స్థాయిలో నేతలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆదేశాలు వచ్చాయని కేడర్ చెబుతుంది.
మండల స్థాయి లీడర్ లేదా వైసిపి మండల అధ్యక్షుడు రోజుకు ఒక సచివాలయాన్ని సందర్శించి, అక్కడి ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులను కలిసి అవి తమ ప్రభుత్వం ఇచ్చినవే కాబట్టి ఈసారి ఓటు మాకే వేయాలి అని విజ్ఞప్తితో కూడిన బెదిరింపులకు దిగునున్నారు. ప్రతి కుటుంబానికి అందిన పథకాలు వాటి వల్ల లబ్ధి పొందిన మొత్తం ఎంత అని నమోదు చేసి ఒక పత్రాన్ని తయారుచేసి దానిపై వైసీపీకి రుణపడి ఉన్నా అని రాసి సంతకం తీసుకోనున్నారు. గ్రామస్థాయిలో ఉన్న వర్గ పోరును పోగొట్టడానికి ఈ కార్యక్రమంలో అందరూ కలిసి సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
పల్లెల్లో వైసిపి పై ఎంత వ్యతిరేకత ఉన్నది అందరికీ తెలుసు కాబట్టి ఈ కార్యక్రమానికి జగన్ వెళ్లకుండా నేతలను పంపుతున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందా?? లేక గడపగడపకు మన ప్రభుత్వం లా నిరాశను మిగులుస్తుందా వేచి చూడాలి.