స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటినుండి టిడిపి శ్రేణులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్యాయం అని, అక్రమమని నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. చంద్రబాబుకి మద్దతుగా నిరాహార దీక్షలు, ర్యాలీలు చేస్తూనే ఉన్నారు.
ఇక బాబు కోసం న్యాయ పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ఇటీవల కోర్టులో బాబుకు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఇక్కడ కోర్టు తీర్పులని గౌరవించాల్సిందే. కాకపోతే టిడిపి శ్రేణులు మాత్రం వైసీపీని అనుమానిస్తుంది. ఎందుకంటే కోర్టు తీర్పు రాక ముందు రోజే..ఎలాంటి తీర్పులు ఇస్తారో సోషల్ మీడియాలో ఎలా పోస్టు చేశారని అనుమానిస్తున్నారు. తీర్పు రావడానికి ఒక రోజు ముందే ఏం జరుగుతుందో వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఖచ్చితంగా వారు పోస్ట్ పెట్టినట్లే జరిగింది. క్వాష్ పిటిషన్ కొట్టేస్తారు అని చెప్పినట్టే జరిగింది.
వైసిపి కక్ష సాధింపు అని అందరూ అంటున్న, అప్పటివరకు అనుమానంగా ఉన్న కొందరికి వారు పెట్టిన పోస్ట్ లోని విషయం నిజమయ్యే సరికి కచ్చితంగా వైసిపి హస్తముతోటే కక్ష కట్టి చంద్రబాబునాయుడును జైలుకు పంపించారు అనే విషయం పూర్తిగా అర్థం అయిందని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి.
అటు కస్టడీ విషయంలో అదే జరిగింది. అన్ని విషయాలు అధికార పార్టీ నేతలు చెప్పినట్టు జరుగుతుండటంతో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జగన్నాటకం