టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో సైలెన్స్ నెలకొంది. అదేంటి బాబు అరెస్ట్ అయితే టిడిపి వాళ్ళు సైలెంట్ అవ్వాలి కదా అని అనుకోవచ్చు. కానీ రివర్స్ లో పరిస్తితి ఉంది. బాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని అంతా భావిస్తున్నారు. బాబుని కక్షపూరితంగా అరెస్ట్ చేశారని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి శ్రేణులు బాబు కోసం మరింత ఎక్కువగా పోరాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తమ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు.
టిడిపి ఇంకా దూకుడుగా ఉంది. కానీ వైసీపీలోనే సైలెన్స్ ఉంది. ఇక బాబు అరెస్ట్ అవ్వడంతో వైసీపీ కుట్రలు చేసి బాబుపై బురద చల్లడానికి చూస్తుంది…కానీ అది అంతగా వర్కౌట్ కావడం లేదు. పైగా గతంలో మాదిరిగా ఇప్పుడు మీడియా ముందుకొచ్చి పెద్దగా మాట్లాడలేని పరిస్తితి. ఏదో కొందరు తప్ప..మిగతా నేతలు సైలెంట్ గానే ఉన్నారు. జగన్ మెప్పు కోసం కొందరు హడావిడి చేస్తున్నారు గాని..అసలు సీన్ అర్ధమైన వాళ్ళు మాత్రం మౌనంగానే ఉన్నారు. వైసీపీలో మెజారిటీ సభ్యులు బాబుని ఈ సమయంలో అరెస్ట్ చేయడం అవసరమా? అనే భావనలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
చాలామందికి రాజకీయంగా ఇది ఎదురుదెబ్బ అనే పరిస్తితుల్లో ఉన్నారు. పైగా టిడిపి-జనసేన పొత్తు సెట్ అయ్యేలా చేశారని, దీని వల్ల వైసీపీకే నష్టమని లోలోపల ఆవేదన చెందుతున్నారు. మామూలుగానే ప్రజా వ్యతిరేకత ఉంది. అటు టిడిపి బలపడుతుంది. అలాంటప్పుడే బాబుని అరెస్ట్ చేశారు. ఇది టిడిపికే అడ్వాంటేజ్. పైగా టిడిపితో జనసేన కలిసింది. ఇది ఇంకా వైసీపీకి రిస్క్ అని పలువురు వైసీపీ నేతలు భావిస్తున్నారు.
అందుకే చాలామంది వైసీపీ నేతలు బాబు అరెస్ట్ పై స్పందించడం లేదు. అరెస్ట్ పై నెగిటివ్ గా స్పందించి..నెగిటివ్ అవ్వడం కంటే సైలెంట్ గా ఉండటం బెటర్ అని భావిస్తున్నారు. అందుకే వైసీపీలో సైలెన్స్ నెలకొంది.
ReplyReply allForward |