చంద్రబాబునాయుడు అరెస్టుతో రాష్ట్రంలో ప్రజా సమస్యలు, అదే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలని అవలభించే వైసీపీపై పోరాటం కాస్త ఆగింది. టిడిపి శ్రేణులు…టోటల్ గా బాబు అరెస్ట్ పై నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఓ వైపు బాబు కోసం పోరాటం చేస్తూనే..మరోవైపు వైసీపీపై పోరాటానికి టిడిపి సిద్ధమవుతుంది. ఇప్పటికే బాబు అరెస్ట్ తో ప్రజలలో సానుభూతి వచ్చింది. ఆ సానుభూతిని ఓట్లుగా మార్చుకోవాలని టిడిపి వ్యూహరచన చేస్తుంది.
టిడిపికి తోడు జనసేన కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి తామే వస్తామని దీమాతో ఉన్నారు టిడిపి నాయకులు. ఎన్నికలలో విజయమే లక్ష్యంగా టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో లోకేష్, బాలకృష్ణ , సీనియర్లు అచ్చన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు తో పాటు మరి కొంతమందికి స్థానాన్ని కల్పించారు. ఈ కమిటీ చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే నడుస్తోంది అని అచ్చన్నాయుడు తెలిపారు. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ సభ్యులు లోకేష్ ఆపి వేసిన పాదయాత్రను మళ్ళీ కొనసాగించాలని నిర్ణయించినట్లు టిడిపి నాయకులు అంటున్నారు.
టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ చంద్రబాబు నాయుడు అరెస్టుతో యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్, ఢిల్లీ పెద్దలతో చర్చలు, లాయర్లతో మంతనాలు ఇలా హడావిడిలో ఉన్న లోకేష్ పాదయాత్ర గురించి ఆలోచించటానికి సమయమే లేకుండా పోయింది. ఇప్పుడు ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలి అని టిడిపి నాయకులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
లోకేష్ పాదయాత్రను కోనసీమ జిల్లా పొదలాడలో ఆపారు, అక్కడి నుంచే ఈ వారం లో ఆ యాత్రను ప్రారంభించాలని లోకేష్ అనుకుంటున్నాట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నారు. ఈసారి పాదయాత్ర గతంలో కాకుండా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, తర్వాత పరిణామాల గురించి ప్రజలలోకి వెళ్లి ఇంటింటికి ప్రచారం చేయాలని ఆలోచనలో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత జరిగే పాదయాత్ర కాబట్టి , ఇందులో జన సైనికుల అండతో వైసిపి కుట్రలను ఎండగట్టాలని టిడిపి నాయకత్వం అనుకుంటున్నారు అని తెలుస్తోంది.
గోదావరి జిల్లాలో అంటేనే జనసేనకు పట్టున్న జిల్లాలు అక్కడ జనసేన, టిడిపి కలిపి పాదయాత్ర అంటే రోడ్లన్నీ జనసంద్రమే అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పొత్తు విజయం సాధించి టిడిపి విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకం ప్రారంభం అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ReplyReply allForward |