చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారమే సృష్టించిందని చెప్పవచ్చు. టిడిపి నేతలు, కార్యకర్తలే కాకుండా ఆంధ్ర ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురి అయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అందరూ తప్పుపట్టారు. అధికార పార్టీ అక్రమంగా అరెస్టు చేసిందని దుయ్యబట్టారు. అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ధర్నాలు, ర్యాలీలు ,బందులు నిర్వహించారు . కానీ కోర్టులో తీర్పు మాత్రం చంద్రబాబుకి అనుకూలంగా రాలేదు. హైకోర్టులో అయినా తీర్పు తమకు అనుకూలంగా వచ్చి చంద్రబాబునాయుడు బయటకు వస్తారు, అని ఆశతో ఎదురు చూశారు కానీ వారి ఆశలు ఆవిరి చేస్తూ హైకోర్టు సిబిఐ ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు తమ తక్షణ కర్తవ్యం ఏంటని టిడిపి నాయకులు ఆలోచనలోపడ్డారు.
మన రాష్ట్రంలో జరిగిన చంద్రబాబునాయుడు అరెస్ట్ అక్రమమని ప్రపంచానికి తెలియజేయాలి, అంటే టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఒకేసారి రాజీనామా చేయాలి అని టిడిపి నేతలు నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఆ విషయం సెన్సేషన్ న్యూస్ అవుతుంది. అప్పుడు దేశమంతా మన రాజకీయాల వైపు చూస్తుంది. అప్పుడు చంద్రబాబు ను నిరాధారంగా అక్రమంగా అరెస్టు చేశారని చర్చ ప్రముఖుల అందరి మధ్య జరగాలి అని టిడిపి నేతలు ప్లాన్ చేస్తున్నారు. మరి టిడిపి నేతలు వ్యూహం ఫలించి చంద్రబాబుకు అందరి మద్దతు దొరుకుతుందా?? నిరపరాధిగా బయటకు వస్తారా?? వేచి చూడాల్సిందే????
ReplyReply allForward |