రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. జైల్లో చంద్రబాబును కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించారు. టిడిపి జనసేన కలిస్తే ఖచ్చితంగా ఈసారి విజయం సాధించవచ్చు అని టిడిపి జనసేన ధీమాతో ఉన్నారు.
నాయుడు అరెస్ట్ తర్వాత ప్రజలలో టిడిపి పై సానుభూతి పెరిగిందని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఆ సానుభూతి కి జనసేన పొత్తు తోడైతే కచ్చితంగా ఈసారి అధికారంలోకి వచ్చేది టిడిపి ప్రభుత్వమే అని చెబుతున్నారు. టిడిపి జనసేన కలిసి ఉమ్మడి 5 జిల్లాలలో 48 స్థానాలలో కచ్చితంగా విజయం సాధిస్తాయని సర్వేలు చెబుతున్నా యి.టిడిపి జనసేన పార్టీలో ఇచ్చాపురం, టెక్కలి శ్రీకాకుళం, ఆమదాలవలస మొదలుకొని విశాఖ నాలుగు నియోజకవర్గాలు, పిఠాపురం, కాకినాడ ,ఏలూరు ,దెందులూరు వరకు 48 స్థానాలలో జనసేన టిడిపి కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని సర్వేలు, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ఎనిమిది జిల్లాలను 40 స్థానాలలో గెలిస్తే టిడిపి అధికారం ఏర్పాటు నల్లేరు మీద నడకే అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .
ReplyReply allForward |