విలక్షణమైన తీర్పునివ్వడంలో తిరుపతి ఓటర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటివరకు అన్ని పార్టీలను ఆదరించింది. ప్రజారాజ్యం నుండి చిరంజీవిని గెలిపించారు. అటు టిడిపి అభ్యర్థిని గెలిపించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసిపి భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి ప్రస్తుతం టిటిడి చైర్మన్ పదవిని ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో అతని కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా నిలబెడతారు అని వార్తలు వస్తున్నాయి.
టిడిపి తరఫున గతంలో సుగుణమ్మ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేటతో ఓటమిని పొందారు. అప్పుడు సుగుణమ్మ ఓటమికి జనసేన వేరుగా పోటీ చేయడం ఒక కారణమైతే, సుగుణమ్మ కూడా వైసీపీతో రాజీ పడ్డారు అనే వార్తలు కూడా వినిపించాయి. ఈసారి సుగుణమ్మ భూమన కరుణాకర్ రెడ్డిని తట్టుకుని నిలబడలేదని, అయినా టిడిపి తరఫున సుగుణమ్మకు సీట్ ఇచ్చేది లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సుగుణమ్మ తన మనవరాలిని పోటీలో నిలబెట్టాలి అని అనుకుంటుంటే కార్పొరేటర్ గానే గెలిపించలేకపోయిన, మనవరాలిని ఎమ్మెల్యేగా చేస్తారా అని టిడిపి నాయకులు అంటున్నారు. జనసేన తరఫున తిరుపతిలో పవన్ పోటీ చేస్తే మాత్రమే గెలవగలరు. వేరే ఎవరైనా ఓటమి తప్పదు. టిడిపి తరఫున ఇప్పుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం పేరు వినిపిస్తోంది. బాలసుబ్రమణ్యం నారా లోకేష్ కు సన్నిహితుడు. ఇతనికి తిరుపతిలోని స్లమ్ ఏరియాలలో పట్టుంది. ఎలైట్ హాస్పిటల్స్ అధినేత, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటాడు. అంగ బలములో కానీ అర్థబలంలో గానీ భూమన కరుణాకర్ రెడ్డి కి గట్టి పోటీ ఇవ్వగలిగిన నేత ఉన్నారు అంటే అతను బాలసుబ్రమణ్యం మాత్రమే.
భూమన కుటుంబంపై రియల్ ఎస్టేట్ దందా, అవినీతి ఆరోపణలు, కొండమీద దందా, ,గంజాయి అక్రమ రమణా ఇలా ఎన్నోఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీరిని ఎదుర్కోవాలి అంటే గట్టి అభ్యర్థిని నిలబెట్టాలి. జనసేన నుండి పవన్ తప్ప వేరే అభ్యర్థిని నిలబెట్టినా, టిడిపి నుండి బాలసుబ్రమణ్యం కాకుండా వేరే వ్యక్తి నిలబెట్టినా టిడిపి తిరుపతి స్థానంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇక టిడిపి-జనసేన పొత్తులో పవన్ లేదా బాలసుబ్రహ్మణ్యం పోటీ చేస్తే తిరుపతిలో వైసీపీకి చెక్ పడుతుంది.