విశాఖ పై పట్టు కోసం వైసిపి ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో కూడా విశాఖ తూర్పును గెలుచుకోలేకపోయింది. వైసీపీ దసరా తర్వాత విశాఖలో పాలన ప్రారంభించాలి అని జగన్ అంటున్నారు. విశాఖపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నా వైసిపి గెలుపు కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గత మూడు ఎన్నికల నుండి విశాఖ తూర్పులో టిడిపి జెండా నే ఎగురుతుంది. ఈసారి వైసీపీ జెండా పాతాలని అధికార పార్టీ వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తుంది. విశాఖ తూర్పు లో టిడిపికి పట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. కార్పొరేటర్ గా రాజకీయాల్లో అడుగుపెట్టిన రామకృష్ణ స్థానికంగా తనకంటూ ప్రత్యేక క్యాడర్ ను సంపాదించుకున్నాడు. గత రెండు ఎన్నికల్లో రామకృష్ణకు పోటీగా సరైన అభ్యర్థిని వైసిపి దించలేకపోయింది. ఈసారైనా వెలగపూడి రామకృష్ణకు అంగబలం, అర్ధబలంతో సమానంగా పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థిని పోటీగా నిలబెట్టాలని చూస్తున్న వైసీపీకి ఆశా కిరణంలా ఎంపీ ఎంవీవి సత్యనారాయణ కనిపించారు. ఎంవివిను వైసీపీ తన అభ్యర్థిగా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది.
బిల్డర్ గా పేరు ఉన్న ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటే, గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీ అభ్యర్థిగా అవకాశం రావడంతో ఎంపీగా గెలుపొందారు. ఈసారి ఎమ్మెల్యేగా నిలబడాలని సత్యనారాయణ కోరికను వైసిపి అధిష్టానం అంగీకరించటంతో, నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలతో తన ముద్ర వేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. యువతకు ఆకర్షణీయమైన బహుమతులతో తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ విశాఖ తూర్పు టికెట్ ఆశించిన వైసిపి ఇన్చార్జ్ విజయనిర్మల ఇంకా ఆశ వదులుకోలేదు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరితే తప్ప విశాఖ తూర్పున వైసీపీ విజయం సులభం కాదు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎంవివి, విజయనిర్మల మధ్య రాజీ కోసం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయినా సరే ఎంపిగా ఎంవివికి నెగిటివ్ తప్ప పాజిటివ్ లేదు. అటు వెలగపూడి బలమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో విశాఖ తూర్పులో వెలగపూడిని ఓడించడం కష్టమే.