తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు. కానీ ఆ విమర్శల్లో వాస్తవం లేదనే చెప్పాలి. చంద్రబాబు అన్నీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. పైగా కమ్మ ముద్ర పడుతుందని కమ్మ నేతల్లో పదవులకు అర్హులు ఉన్నా సరే..వారిని పక్కన పెట్టేస్తారు. కానీ వైసీపీ వచ్చాక రెడ్డి వర్గానికి పెద్ద పీఠ ఎలా వేశారో తెలిసిందే. కానీ టిడిపిలో అలా ఉండదు. కానీ కమ్మ పార్టీ అని గత ఎన్నికల్లో వైసీపీ ప్రచారం చేసి సక్సెస్ అయింది.
ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు అర్ధమవుతున్నాయి. పైగా గత ఎన్నికల్లో 40 శాతం కమ్మ వర్గం ఓట్లు వైసీపీకే పడ్డాయి. ఒకవేళ టిడిపి కమ్మ పార్టీ అనుకుంటే..కమ్మ వర్గం ప్రభావం ఉన్న సీట్లు టిడిపి గెలవాలి.కానీ అలా జరగడం లేదు. ఇక కమ్మ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గంలో టిడిపి గెలిచి రెండు దశాబ్దాలు అయింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో ఇక్కడ చివరిగా గెలిచింది. అంతకముందు 1983, 1985 ఎన్నికల్లో గెలిచింది.
అంతే మళ్ళీ అక్కడ గెలవలేదు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సుధాకర్ బాబు గెలిచారు. ఈయన సంతనూతలపాడుకు చేసిందేమి లేదు..అభివృద్ధి శూన్యం..ప్రజలకు అందుబాటులో ఉండేది తక్కువ..ఆ మధ్య టిడిపి ఎమ్మెల్యే స్వామిపై దాడి చేసి..హడావిడి చేసి ఇంకా మైనస్ తెచ్చుకున్నారు.
ఇటు వరుసగా ఓడుతున్న టిడిపి నేత బిఎన్ విజయ్ కుమార్ పై సానుభూతి ఉంది. కాకపోతే అందరినీ కలుపుకుని వెళ్ళాలి. అప్పుడే గెలుపు సాధ్యం. ఇక్కడ కమ్మ వర్గానికి దగ్గరైతే..ఇంకా తిరుగుండదు. ఇంతకాలం కమ్మ వర్గం ఓట్లు టిడిపికి అనుకున్న మేర పడలేదు. ఈ సారి గట్టిగానే పడేలా ఉన్నాయి.అటు ఎస్సీ ఓట్లు కలిసొచ్చేలా ఉన్నాయి. దీంతో సంతనూతలపాడులో టిడిపి గెలిచే ఛాన్స్ ఉంది.