అధికార బలంతో ఉన్న వైసీపీని గద్దె దించడానికి ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపిని ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. విమర్శించినవారిని బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం చేస్తున్నారు. ఆఖరికి చంద్రబాబుని సైతం దారుణంగా తిడుతూ వస్తున్నారు. అయినా సరే టిడిపి నేతలు ఎక్కడా కూడా ప్రజల కోసం పోరాటం ఆపలేదు. వైసీపీ అక్రమాలపై గళం విప్పుతూనే ఉన్నారు. అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు జనంలో ఉంటూ..ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూనే..మరోవైపు జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.
అటు లోకేశ్ పాదయాత్రతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు బాబు..సరికొత్త కార్యక్రమాలు చేస్తూ..జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బాదుడే బాదుడు, మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ..అంటూ కార్యక్రమాలు చేశారు. ఇక టిడిపి మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే లక్ష్యంగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో బస్సు టిడిపి నేతలు బస్సు యాత్ర చేస్తున్నారు.
ఇక ఇప్పుడు నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ వల్ల ప్రజలు నరకం అనుభవించారు అనే విధంగా టిడిపి సరికొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాల గురించి పోస్టర్ల రూపంలో టిడిపి నేతలు ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ నాలుగేళ్లలో ప్రతి వర్గానికి జరిగిన అన్యాయం గురించి టిడిపి పోస్టర్లు ప్రదర్శించనుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆడవాళ్ళపై నాలుగేళ్లలో జరిగిన అరాచకాల గురించి పోస్టర్లు, వీడియోలు విడుదల చేశారు. ఇలా ప్రతి వర్గానికి జరిగిన అన్యాయాలపై టిడిపి గళం ఎత్తనుంది. ఈ అంశాలు ప్రజల్లోకి వెళితే..నాలుగేళ్లలో వైసీపీ పాలన వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇంకా క్లారిటీ రానుంది. ఈ అంశం టిడిపికి ఇంకా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.