వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ తెగ కష్టపడుతుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి రాజకీయం నడుపుతున్నారు. అక్కడ ప్రజలని అధికార బలంతో వైసీపీకి దగ్గరయ్యేలా చేస్తున్నారు. అలా చేసే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. కుప్పం మున్సిపాలిటీలో గెలిచారు.
ఇలా అధికార బలంతో గెలిచి ఇంకా కుప్పం అసెంబ్లీలో కూడా గెలుస్తామని అంటున్నారు. అలాగే ఇంచార్జ్ భరత్కు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు అక్కడ వైసీపీ గెలుపు కోసం పెద్దిరెడ్డి తిరుగుతున్నారు. ఇప్పటికే సిఎం జగన్..ఒకసారి కుప్పం వచ్చి భరత్ని గెలిపిస్తే నెక్స్ట్ మంత్రి అవుతారని అన్నారు. తాజాగా పెద్దిరెడ్డి కూడా అదే నినాదంతో ముందుకెళుతున్నారు.
భరత్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి అవుతారని అంటున్నారు. అయితే ఇక్కడ జగన్ గాని, పెద్దిరెడ్డిగాని ఒక లాజిక్ మిస్ అవుతున్నారు..భరత్ గెలిస్తే మంత్రి అవ్వడం అనేది మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే..రాకపోతే ఎవరు ఏం చేయలేరు. అదే సమయంలో చంద్రబాబు గెలిస్తే సిఎం అవుతారు..ఆ చిన్న లాజిక్ కుప్పం ప్రజలు మరిచిపోరు. అయినా లాజిక్ లతో పని ఏమి లేకుండా కుప్పం ప్రజలు బాబు వైపే ఉన్నారు.
ఇక కుప్పంలో ఈ సారి లక్ష మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు. అక్కడ టిడిపి నేతలు పనిచేస్తున్నారు. అయితే కుప్పంలో బాబుని ఓడించడం వైసీపీకి సాధ్యం కాదు…బాబు గెలుపు ఫిక్స్ కానీ..మెజారిటీ ఎంతనేది చూడాలి.