వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే..అందులో పెద్ద డౌట్ లేదు..అయితే పొత్తులో భాగంగా జనసేన ఏ సీట్లు తీసుకుంటుందనేది పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో జనసేన కొన్ని సీట్లపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సీట్లు ఎక్కువ ఆశిస్తుంది. ఇటీవల పవన్ వారాహి యాత్ర కూడా కొనసాగుతుంది. ఇక పవన్ పర్యటించే ప్రతి నియోజకవర్గం జనసేనకు దక్కుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే పి.గన్నవరం నియోజకవర్గంలో ఇటీవల పవన్ పర్యటించారు. దీంతో పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ ఇక్కడ జనసేన కంటే టిడిపికే బలం ఎక్కువ. పైగా దివంగత బాలయోగి తనయుడు హరీష్..ఇక్కడ టిడిపి ఇంచార్జ్ గా ఉన్నారు. దీంతో ఆ సీటు టిడిపి వదులుకునే ప్రసక్తి లేదని తెలుస్తుంది.
గత ఎన్నికల్లో పి.గన్నవరం సీటు వైసీపీ గెలుచుకుంది. వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు గెలిచారు..ఎమ్మెల్యేగా ఈయన విఫలమయ్యారు. ప్రజా వ్యతిరేకత ఉంది. దీంతో ఇక్కడ టిడిపి గెలుపుకు దగ్గరైంది. కాకపోతే జనసేన సపోర్ట్ ఉంటే ఓట్లు చీలవు. గత ఎన్నికల్లో ఓట్లు చీలిపోయే వైసీపీ గెలిచింది.
గత ఎన్నికల్లో వైసీపీకి 67 వేల ఓట్లు పడితే, టిడిపికి 45 వేలు, జనసేనకు 36 వేలు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన కలిస్తే వైసీపీ గెలుపు కష్టమే. ఇక పొత్తులో సీటు దక్కించుకోవాలని జనసేన చూస్తుంది..కానీ టిడిపి వదులుకునేలా లేదు. మరి చివరికి ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.