ఉమ్మడి విజయనగరం జిల్లా అంటే రెండు పేర్లు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి..ఒకటి అశోక్ గజపతి రాజు, రెండు బొత్స సత్యనారాయణ..అనేక ఏళ్ల నుంచి జిల్లాలో వీరి హవా నడుస్తుంది..అశోక్ జిల్లాలో టిడిపి హవా నడిచేలా రాజకీయం చేస్తే..బొత్స గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడిచేలా ముందుకెళుతున్నారు. అయితే గత ఎన్నికల్లో జిల్లాలో బొత్స హవా నడిచింది..బొత్స తన బంధువులు, అనుచరులని పలు సీట్లలో గెలిపించుకున్నారు.
దీంతో జిల్లాలో 9కి 9 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఆఖరికి అశోక్ కంచుకోట విజయనగరంలో టిడిపి ఓడింది. అంటే ఏ స్థాయిలో బొత్స హవా నడిచిందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ సారి బొత్స హవాకు అశోక్ చెక్ పెట్టే దిశగా వెళుతున్నారు. జిల్లాలో టిడిపి బలం పెరుగుతుంది. ఈ సారి మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే దిశగా వెళుతుంది..బొత్స బంధువులు, అనుచరులు జెండా ఎత్తేసేలా ఉన్నారు. జిల్లాలో మొత్తం 9 సీట్లు ఉన్న విషయం తెలిసిందే.
బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోట, నెల్లిమర్ల, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లి సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అన్నీ సీట్లు వైసీపీ గెలుచుకుంది..ఇప్పుడు టిడిపి మెజారిటీ సీట్లు దక్కించుకునే దిశగా వెళుతుంది. ఇప్పటికే టిడిపి..బొబ్బిలి, ఎస్ కోట, నెల్లిమర్ల, విజయనగరం సీట్లలో లీడ్ లో ఉంది. అటు పార్వతీపురం, గజపతినగరం సీట్లలో వైసీపీకి గట్టి పోటీ ఇస్తుంది.
ఇటు కురుపాంలో వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణిపై యాంటీ ఎక్కువ ఉంది. టిడిపి కష్టపడితే గెలిచేయవచ్చు. ఇక సాలూరులో వైసీపీకే లీడ్ ఉంది. చీపురుపల్లిలో బొత్స ఉన్నారు..కాబట్టి అక్కడ వైసీపీ ఆధిక్యం ఉంది.