ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయని చెప్పవచ్చు. గెలిచే అభ్యర్థుల కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేలు నిర్వహించి గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలో దించుతున్నారు.
చీరాల అసెంబ్లీ నియోజకవర్గం. రాజకీయ సామాజిక చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున కరణం వెంకటేష్ ఇంచార్జిగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా అతని పేరే దాదాపు ఖరారు అయినట్లు చెబుతున్నారు. కానీ కరణం వర్గానికి, ఆమంచి వర్గానికి మధ్య పోసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి తరఫున ఎంఎం కొండయ్య ఇంచార్జిగా ఉన్నారు. కొండయ్యకు ఇంచార్జి ఇచ్చిన తర్వాత చీరాల అసెంబ్లీలో టిడిపి బలం పెరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా వైసిపి నేతల మధ్య ఉన్న వర్గ పోరు కూడా ఈసారి కొండయ్య గెలుపుకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. కానీ కొండయ్య కన్నా మునగపాటి (బాబు) వెంకటేశ్వరరావుకు టికెట్ ఇస్తే సామాజిక సమీకరణాల ప్రకారం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా నేతల సమన్వయంతో విజయం సాధించవచ్చని టిడిపి నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యతిరేకత కూడా టిడిపికి లాభిస్తుందని చెప్పవచ్చు. నియోజకవర్గం లో వైసీపీ పై ఉన్న వ్యతిరేకతతో పాటు వైసిపి నేతల మధ్య వర్గ పోరు కూడా ఈసారి చీరాలలో టిడిపికి విజయాన్ని అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్నికల వేళకు టిడిపి తరఫున ఎవరు నిలబడిన వైసిపి కి ఓటమి తప్పదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి..