రాష్ట్రం లో గాలి మారుతుంది..వైసీపీ గాలికి బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ లీడ్ లోకి వచ్చింది. ఇదే క్రమంలో గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన సూళ్లూరుపేట లో సీన్ మారుతుంది. తాజాగా నియోజకవర్గంలో పంచాయితీ ఉపఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. అక్కడ టీడీపీ వార్డుల్లో ఎక్కువ ఏకగ్రీవాలను కైవసం చేసుకుంది. సూళ్లూరుపేటలో టిడిపి మూడు స్థానాలను ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నది అంటేనే తెలుస్తోంది ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఏమిటో!!!
సూళ్లూరుపేట వైసీపీలో అంతర్గత గొడవలు వర్గ పోరు భారీగానే ఉన్నాయి. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్లని ఎమ్మెల్యే సంజీవయ్య అధికార బలంతో పోలీసులను అడ్డం పెట్టుకొని వేధిస్తున్నారని సామాన్య కార్యకర్తల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సంజీవయ్య వల్ల ఇబ్బంది పడిన సామాన్య కార్యకర్తలందరూ ఎమ్మెల్యే పై వ్యతిరేకంగా ఉన్నారు. ఎంతటి వ్యతిరేకం అంటే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంజీవయ్య వెళితే సొంత పార్టీ వాళ్లు నిరసనతో మా ఊరికి రావ్వద్దు పొమ్మని చెప్పేటంత .
ప్రభుత్వం అందించే అన్ని పథకాలు ప్రజలకు చేరుతున్న టిడిపి ఏకగ్రీవాలు అంటే ఎమ్మెల్యే పార్టీని వదిలేసారా లేక ఎమ్మెల్యేను పార్టీ వదిలేసిందా అని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఈసారి సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ వశం కావడం ఖాయమని అంటున్నారు.