ఎన్నికల ముందు అన్ని పార్టీల వారు సర్వేల వైపు చూస్తూ ఉంటారు ప్రముఖ సంస్థలు ఛానల్ వాళ్ళు చేసే సర్వే, సొంతంగా పార్టీ వాళ్ళు చేయించుకునే సర్వేలు కొన్ని. సర్వేలో ఎవరి వైపు ఎక్కువ ప్రజాధరణ ఉంటుందో ఆ లీడర్ కే పార్టీలు టికెట్ ఇస్తాయి. ఎన్నికల ముందు సర్వే అంటే అది ఏదైనా ప్రజలందరూ ఆసక్తిగానే ఉంటారు అలాంటిది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఐప్యాక్ సర్వే లీక్ అంటూ సోషల్ మీడియాలో ఒక సర్వే చెక్కర్లు కొడుతుంది. ఆ సర్వే ప్రకారం అధికార పార్టీపై ప్రజలలో . వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలుస్తుంది.
ఐప్యాక్ తొలి సర్వే ఆధారంగా పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ ఏర్పాటు చేసి తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని అలా మెరుగైన వారికి టికెట్ ఇస్తామని జగన్ గట్టిగానే చెప్పారు.
ఎంపీ స్థానాల గురించి చేసిన ఈ సర్వేలో గతంలో 22 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న వైసిపికి ఈసారి పోటీకి నిలబెట్టే అభ్యర్థులే కరువయ్యారు. సర్వేలు 16 మంది ఎంపీ స్థానాలకు పోటీ చేసేవారు ఉండగా వారిలో ఎందరు గెలుస్తారు చెప్పలేము అని అంటున్నారు. ఎటు చూసుకున్న ఈసారి వైసీపీకి 4-5 ఎంపీ సీట్లు రావడమే గొప్ప అంటున్నారు.
గతంలో రాయలసీమలో అన్ని స్థానాలు కైవసం చేసుకున్న వైసిపి ఈసారి అందులో సగం స్థానాలు గెలిస్తే ఎక్కువే అని సర్వేని బట్టి తెలుస్తుంది.
గతంలో కన్నా టిడిపి ఎప్పుడు ప్రజలలో గట్టి పట్టు సాధించిందని చెప్పవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఉభయ గోదావరి ,విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది. పవన్ తన అభిమానులతో ఈసారి ఎన్నికల్లో 15 శాతం ఓట్లు అధికార పార్టీ నుండి సొంతం చేసుకునే అవకాశం ఉంది. టిడిపి కూడా 40- 45 శాతం ఓట్లు సాధించి అవకాశం ఉంది.టీడీపీ, జనసేన కలిస్తే 18 ఎంపీ స్థానాలపైనే గెలుచుకునే ఛాన్స్ ఉంది.
అధికార పార్టీపై, పార్టీ నేతలపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఎలా ఉందంటే అధికార పార్టీ నేతల సభలకే కాదు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సభలకు కూడా జనం కరువు. ప్రత్యేక వాహనాలు పెట్టి డ్వాక్రా వాళ్ళ సహాయంతో జనాన్ని పోగు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులకే కాదు సామాన్యులకు సైతం అర్థమవుతుంది. కానీ ప్రతిపక్ష నేతల సభలకు మాత్రం జనం ప్రభంజనంగా వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి వైసిపి గెలిచే అవకాశాలు తక్కువ అని సామాన్యులకు సైతం అర్థమవుతుంది .ఐ ప్యాక్ సర్వే ప్రకారం వైసీపీకి 45 -55 వరకు మాత్రమే అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని, టీడీపీకి 110 వరకు, జనసేనకు 10 సీట్ల వస్తాయని చెప్తుంటే వైసిపి నేతలలో ఈ సర్వే కలవరం పెంచి నిద్రకు దూరం చేస్తుంది.
ReplyReply allForward |