ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం..పేద ప్రజల్లో గుండెల్లో ఎల్లపుడూ ఉండే నాయకుడు..ఇక ఎన్టీఆర్కు ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అటు సినిమాల్లోనే కాదు..రాజకీయాల్లో కూడా ఆయన మాస్ అవతార్ ఓ రేంజ్ లో ఉంటుంది. తన పదునైన స్పీచ్లతో అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకోగలరు. అయితే ఎన్టీఆర్కు భిన్నమైన ఇమేజ్ చంద్రబాబుకు ఉంది.
ఈయన విజనరీ లీడర్..అన్నీ వర్గాలకు మేలు చేసేలా పాలించారు..కానీ ఈయనకు మాస్ ఇమేజ్ పెద్దగా రాలేదనే చెప్పాలి. బాబు స్పీచ్లు ఎల్లపుడూ ఒక మాస్టర్ పాఠాలు చెప్పినట్లే ఉంటాయి. అంటే ఆయన వే ఆఫ్ స్పీచ్ అలా ఉంటుంది. చెప్పాలంటే పక్కా క్లాస్ లీడర్ బాబు. 2019 ఎన్నికల తర్వాత బాబు మాస్ స్పీచ్ లతో అదరగొడుతున్నారు..అదే వేరే విషయం కానీ..బాబుకు అనుకున్న మేర మాస్ ఇమేజ్ అనేది రాలేదనే చెప్పాలి. కానీ బాబుకు రాని ఇమేజ్ ఇప్పుడు లోకేష్కు వచ్చింది.
అసలు మాట్లాడటం రాదు..అన్నీ తప్పులే చెబుతారు..పప్పు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేసేవారు. అలాంటి నాయకుడు పరిపూర్ణమైన మాస్ నాయకుడుగా ఎదిగారు. మాట తీరు మారింది..తడబాటు పోయింది..ఒక విషయాన్ని చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారు. ప్రత్యర్ధులకు మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు. తన పాదయాత్రతో మరో లెవెల్కు లోకేష్ ఎదిగారు.
తాజాగా గన్నవరం సభలో ఆయన స్పీచ్ చూస్తే పూర్తిగా మాస్ లీడర్ గా మారిపోయారని చెప్పవచ్చు. వైసీపీ నేతలకు ఆయన ఇచ్చే వార్నింగ్లు ఆద్యంతం తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్తేజం తీసుకొచ్చాయి. తన తల్లిని అసెంబ్లీ అవమానించిన వారిని అధికారంలోకి రాగానే..కట్డ్రాయర్ మీద తిప్పుతానని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ దేవుడు..చంద్రబాబు రాముడు అని..కానీ తాను వైసీపీ వాళ్ళకు మూర్ఖుడు అని అంటూ లోకేష్ చెప్పడం పెద్ద హైలైట్. ఓవరాల్ గా చూస్తే పప్పు టూ పీపుల్ లీడర్గా లోకేష్ ఎదిగారు. పక్కా మాస్ నాయకుడుగా పరిణితి చెందారు.
ReplyReply allForward |