గన్నవరం గర్జించింది..ఇప్పటివరకు యువగళం జరిగిన సభలు ఒక ఎత్తు అయితే..గన్నవరంలో జరిగిన సభ మరొక ఎత్తు..అనూహ్యంగా భారీ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు గన్నవరం సభకు తరలివచ్చారు. ఈ దెబ్బతో కృష్ణా జిల్లాలో వైసీపీకి టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. జనం జనం.. ప్రభంజనమైంది. గన్నవరం సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఊహించని స్థాయిలో గన్నవరం సభ హిట్ అయింది. ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని టిడిపి శ్రేణులే ఊహించి ఉండవు.
అయితే ఈ సభ సక్సెస్కు కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. మొదట ఎవరేం అనుకున్న గన్నవరం టిడిపి కంచుకోట..అందుకే భారీ స్థాయిలో శ్రేణులు వచ్చాయి..చుట్టూ ఉన్న గుడివాడ, విజయవాడ, కృష్ణా జిల్లాల్లో తమ్ముళ్ళు కదిలివచ్చారు. ఇక రెండోది లోకేష్ యువగళం పాదయాత్ర..మామూలుగా జనం ఎక్కువ బాబు సభలకు ఎక్కువ వస్తారు. కానీ పాదయాత్ర మొదలయ్యాక లోకేష్ సైతం ఓ క్రౌడ్ పుల్లర్ మాదిరిగా మారిపోయారు. ఆయన సభలకు భారీగా జనం వస్తున్నారు.
ఇక మూడోది..జిల్లా తమ్ముళ్ళ కృషి..కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నేతలు సభ సక్సెస్ చేయడం కోసం కష్టపడ్డారు. ప్రతి ఒక్క నేత కసితో పనిచేశారు. నాల్గవది వైసీపీపై ఉన్న వ్యతిరేకత..ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు..తెలుగుదేశంకు మద్ధతు ఇవ్వాలనే కసితో ఉన్నారు.
ఆఖరిది..అసలైన కారణం ఏంటంటే..కొడాలి నాని, వల్లభనేని వంశీలపై ఉన్న కసి. ఈ ఇద్దరు టిడిపిలో ఎదిగి..వైసీపీలోకి వెళ్ళి చంద్రబాబుని ఎలా తిడుతున్నారో తెలిసిందే..ఆఖరికి భువనేశ్వరి గురించి ఎలా మాట్లాడారో తెలిసిందే. అందుకే వీరికి చెక్ పెట్టాలని తమ్ముళ్ళు కసితో ఉన్నారు. ఆ కసితోనే గన్నవరం సభకు భారీగా తమ్ముళ్ళు వచ్చారు. ఈ గన్నవరం సభకు ఇంకా కృష్ణా జిల్లా వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెట్టడం మొదలయ్యాయని చెప్పవచ్చు.