గన్నవరం టిడిపి అభ్యర్ధి ఎవరు? వంశీకి చెక్ పెట్టేది ఎవరు? ఈ ప్రశ్నలు ఎప్పుడైతే వంశీ టిడిపిని వదిలి వైసీపీలోకి వెళ్లారో అప్పటినుంచి తెలుగు తమ్ముళ్ళ మదిలో మెదులుతున్నాయి. పైగా వైసీపీలోకి వెళ్ళి వంశీ..చంద్రబాబుని, లోకేష్ని ఎలా తిడుతున్నారో తెలిసిందే. ఆఖరికి భువనేశ్వరిపై కూడా ఎలాంటి అసభ్య కామెంట్లు చేశారో తెలిసిందే. అందుకే వంశీని ఓడించాలని తమ్ముళ్ళు కసితో ఉన్నారు.
అయితే ఆ కసికి తగ్గట్టుగా గన్నవరంలో టిడిపి అభ్యర్ధి ఫిక్స్ కాలేదు. వంశీ వెళ్ళాక బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్గా పెట్టారు..కానీ ఆయన అనారోగ్యం వల్ల మరణించారు. తర్వాత కొనకళ్ళ నారాయణ తో కమిటీ వేయించారు. ఎన్ని చేసిన గన్నవరంలో వంశీ బలం తగ్గించలేదనే టాక్ ఉంది. ఇటు టిడిపి శ్రేణులు సైతం నడిపించే నాయకుడు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు గన్నవరం సీటు కోసం పోటీ పడుతున్నారు. దేవినేని అపర్ణ, పట్టాభి…అటు వైసీపీకి దూరంగా ఉన్న దాసరి బాలవర్ధనరావు, చలసాని ఆంజనేయులు..ఇలా పలువురు గన్నవరం సీటు పై ఆశలు పెట్టుకున్నారు.
ఇదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలోకి వచ్చారు. లోకేష్ తో కలిసి పాదయాత్ర చేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తానని చెప్పారు. అయితే గన్నవరం సీటు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఖచ్చితంగా యార్లగడ్డ పోటీ చేసి..వంశీని ఓడిస్తారని సభలో టిడిపి లీడర్లు చెప్పలేకపోయారు. ఎవరికి సీటు ఇస్తే వారే వంశీని ఓడిస్తారని మాట్లాడారు.
దీంతో యార్లగడ్డకు సీటు ఇచ్చే విషయంలో టిడిపి అధిష్టానం ఆలోచనలో ఉందా? లేక కరెక్ట్ సమయం చూసి..ఆయనకు గన్నవరం బాధ్యతలు అప్పగిస్తారా? అనేది చూడాల్సి ఉంది.ఒకవేళ ఆయన కాకుండా మరో బలమైన అభ్యర్ధిని బరిలో దించుతారా? అనేది కూడా చూడాలి