ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువనే సంగతి చెప్పాల్సిన పని లేదు. పార్టీ ఏదైనా మెజారిటీ స్థానాల్లో కమ్మ నేతల హవానే ఉంటుంది. అయితే కమ్మ సామాజికవర్గం గత ఎన్నికల్లో వైసీపీ వైపు కూడా మొగ్గు చూపింది. దీంతో టిడిపి కమ్మ నేతలకు చెక్ పడింది. వైసీపీ నుంచి కమ్మ నేతలు విజయం సాధించారు. టిడిపి నుంచి కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. కృష్ణాలో గన్నవరంలో వల్లభనేని వంశీ, విజయవాడ ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ గెలిచారు. నెక్స్ట్ వంశీ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే.
ఇక టిడిపి నుంచి పలువురు కమ్మ నేతలు పోటీ చేసి ఓడిపోయారు. పెనమలూరులో బోడే ప్రసాద్, మైలవరంలో దేవినేని ఉమా, గుడివాడలో దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయి..తర్వాత వైసీపీలోకి వెళ్లారు. గుంటూరులో టిడిపి నుంచి ఒక్కరూ కూడా గెలవలేదు. పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, మంగళగిరిలో నారా లోకేష్, సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్, వినుకొండలో జివి ఆంజనేయులు, పెదకూరపాడులో శ్రీధర్ బాబు, గురజాలలో యరపతినేని శ్రీనివాస్ రావు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలిలో ఆలపాటి రాజా పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఈ సారి సీన్ మారుతుంది..కమ్మ నేతలు వైసీపీపై రివెంజ్ తీర్చుకునే దిశగా వెళుతున్నారు. ఈ సారి వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అటు కమ్మ వర్గంతో పాటు బిసి వర్గాలు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎస్సి వర్గంలో కూడా మార్పు ఉంది. ఈ పరిణామాలతో ఈ సారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టిడిపి నుంచి పోటీ చేసే కమ్మ నేతలు విజయం దిశగా ముందుకెళుతున్నారని చెప్పవచ్చు. కొన్ని చోట్ల మార్పులు తప్ప..దాదాపు ఆ స్థానాల్లో కమ్మ నేతలు పోటీ చేయడం ఖాయం. అలాగే గెలవడం ఫిక్స్.