ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకులకు, ప్రజలకు అండగా ఉండే నాయకులకు ఓటములు ఉండవనే చెప్పాలి. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే ఏ నాయకుడు కూడా ఓటమి పాలవ్వడం కష్టమే. కానీ ప్రత్యర్ధులు ఎన్నో రకాల కుట్రలు చేసి ఓడించాలని చూసిన అవి రివర్స్ అవుతాయి తప్ప..ప్రజా నాయకులని ఓడించలేవు. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విషయంలో కూడా అదే జరుగుతుందని చెప్పవచ్చు.
మూడు ఎన్నికలు..మూడు విజయాలు..ఇప్పుడు నాల్గవ విజయం దిశగా వెళుతున్న వెలగపూడికి వైసీపీ బ్రేకులు వేయడం కష్టమే. 2009లో తొలిసారి విశాఖ ఈస్ట్ నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచిన వెలగపూడి.. అక్కడి ప్రజలకు అండగా నిలబడ్డారు. అందుకే 2014లో భారీ మెజారిటీతో గెలిపించారు . టిడిపి అధికారంలో ఉండగా విశాఖ ఈస్ట్ లో అభివృద్ధిని పరుగెత్తించారు. అలా చేయడం వల్లే 2019లో జగన్ గాలి ఉన్న సరే విశాఖ ఈస్ట్ ప్రజలు మరోసారి వెలగపూడిని గెలిపించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక వెలగపూడిని ఎన్ని రకాలుగా టార్గెట్ చేసి నెగిటివ్ చేయాలని చూశారో చెప్పాల్సిన పని లేదు.
రాజధాని అమరావతికి మద్ధతు ఇచ్చారని ఆయనని గట్టిగా టార్గెట్ చేశారు. అక్రమాలు అంటూ హడావిడి చేశారు. అవేమీ వర్కౌట్ అవ్వలేదు..దీంతో విశాఖ ఈస్ట్ లో నకిలీ ఓట్లు క్రియేట్ చేయడం, టిడిపి ఓట్లు తొలగించడం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వెలగపూడి పోరాడుతున్నారు.
కానీ వైసీపీ ఎన్ని చేసిన ప్రజా మద్ధతు ఉన్న వెలగపూడిని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. మరోసారి విశాఖ ఈస్ట్ లో వెలగపూడి గెలిచి నాల్గవ సారి సత్తా చాటడం ఖాయమే.
ReplyReply allForward |