చిత్తూరు, తిరుపతి..ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలకమైన ప్రాంతాలు. పైగా రాజకీయంగా రెండు చోట్ల వైసీపీ ఆధిపత్యం కొనసాగుతుంది. పేరుకు చిత్తూరు టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినా సరే..అక్కడ వైసీపీ హవా ఉంది. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ హవా తగ్గించి సత్తా చాటాలని బాబు ఛూస్తున్నారు. ఆ దిశగా టిడిపి నేతలు పనిచేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది..కానీ అసలైన చిత్తూరు, తిరుపతి ప్రాంతాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టడం లేదా? అనే డౌట్ వస్తుంది.
అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ సీట్లలో టిడిపి అభ్యర్ధులు ఎవరో తెలియడం లేదు. చిత్తూరు అసెంబ్లీలో ఇంతవరకు టిడిపికి నాయకుడు లేరు. గత ఎన్నికల్లో ఏఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయి..పార్టీకి దూరమయ్యారు. అక్కడ నుంచి నాయకుడు లేరు. ఇప్పటికీ అక్కడ ఎవరు పోటీ చేస్తారో తెలియదు. తిరుపతి అసెంబ్లీ..గత ఎన్నికల్లో వైసీపీ కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే గెలిచింది. టిడిపి నుంచి సుగుణమ్మ పోటీ చేసి ఓడిపోయారు.
ఈ సారి కూడా సుగుణమ్మకు సీటు ఇస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. ఆమె ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదు. దీంతో ఆమెని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది..కానీ ఎవరిని నిలబెడతారో చెప్పలేం. తిరుపతి ఎంపీ సీటులో అంతే..గత ఎన్నికల్లో, ఉపఎన్నికల్లో పనబాక లక్ష్మీ టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు..మళ్ళీ ఆమెకే సీటు ఇచ్చేదీ గ్యారెంటీ లేదు.
చిత్తూరు పార్లమెంట్..కుప్పంలో బాబుకు వచ్చే మెజారిటీతో ఈ సీటు టిడిపి గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లోనే ఓడిపోయింది. ఈ సారి కుప్పంలో బాబుకు మంచి మెజారిటీ వచ్చేలా ఉంది..దీంతో చిత్తూరు ఎంపీగా గెలవచ్చు. కానీ ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు.