నరసారావుపేట పార్లమెంట్..నో డౌట్ ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట..కానీ మధ్య మధ్యలో టిడిపి సత్తా చాటింది. 1984, 1996, 2009, 2014 ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలిచింది. కమ్మతో పాటు రెడ్డి సామాజికవర్గం హవా ఉన్న ఈ పార్లమెంట్ లో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేసి గెలిచారు. ఈయన కమ్మ వర్గమే. అటు టిడిపి నుంచి రాయపాటి సాంబశివరావు పోటీ చేసి ఓడిపోయారు. ఈయన కమ్మ నేతే.
అయితే వైసీపీకి రెడ్డి వర్గం మద్ధతు ఉంటుంది..ఇటు లావు కమ్మ నేత కావడంతో..రెండు వర్గాలు మెజారిటీగా వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో వైసీపీ గెలిచింది. మరి ఈ సారి అక్కడ ఎవరిది పై చేయి అవుతుందనే చర్చ నడుస్తోంది. మొదట అభ్యర్ధుల విషయంలో క్లారిటీ లేదు. వైసీపీ ఎంపీ శ్రీకృష్ణకు..ఆ పార్టీలో కొందరు నేతలతో పడటం లేదు. అలాగే అందరు వైసీపీ నేతల మాదిరిగా ఈయన..చంద్రబాబుపై విమర్శలు చేయరు. దీంతో ఈ సారి శ్రీకృష్ణ పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. కానీ జగన్ తో సన్నిహితంగా ఉండే శ్రీకృష్ణ పార్టీ మారే అవకాశాలు లేవని చెప్పవచ్చు. దాదాపు ఆయనే మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేయవచ్చు.
టిడిపి నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ప్రశ్న..రాయపాటికి వయసు మీద పడింది..ఆయన తనయుడుకు సీటు ఇవ్వలేరు. ఇదే సమాయంలో పుట్టా సుధాకర్ తనయుడు మహేష్ యాదవ్కు సీటు ఇస్తారనే ప్రచారం ఉంది.
కడపకు చెందిన ఈయన..నర్సరావుపేటలో పోటీ చేస్తే కమ్మ వర్గం ఎంతవరకు సహకరిస్తుందనేది పెద్ద ప్రశ్న. ఇలా ఈ సీటు విషయంలో రకరకాల ట్విస్ట్లు ఉన్నాయి. అయితే పార్టీల పరంగా చూస్తే..టిడిపి, వైసీపీ హోరాహోరీగానే ఉన్నాయి. కానీ స్వల్ప మెజారిటీ టిడిపికి ఉంది. ఇంకా అభ్యర్ధి బట్టి గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.